అమెరికాలోని హౌస్టన్ లో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్లో గాయపడ్డ భారతి సహానికి బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు ప్రకటించారు. ఆమె బ్రతకడం అసాధ్యమని చెప్పారు. 22 ఏళ్ళ సహానీ తన చెల్లెలు నమ్రత , సోదరుడు మోహిత్ తో కలిసి మ్యూజిక్ ఫెస్టివల్ కి వెళ్ల్లారు.
మ్యూజిక్ ఫెస్టివల్లో ఒక్క సారిగా అభిమానులు స్టేజివైపునకు దూసుకుపోవడంతో తొక్కిసలాట జరిగింది.. ఒకరిమీద ఒకరు పడిపోయారు. ఎనిమిది మంది ఈ తొక్కిసలాటలో చనిపోయారు.. భారతిని కూడా తొక్కేయడంతో , ఆమెకు ఊపిరి ఆడలేదు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది.. డాక్టర్లు , ఇప్పుడు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయిందని ప్రకటించారు..