లంచగొండి ఐఏఎస్ ని సిబిఐ పట్టేసింది..

    0
    97

    ఒక ఐఏఎస్ ఆఫీసర్ 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా సీబీఐ దాడి చేసి పట్టుకుంది. పంజాబ్ రహదారుల విభాగంలో డైరెక్టర్ గా ఉన్న పరంజీత్ సింగ్ ఒక అధికారి ప్రమోషన్ కోసం ఈ 2 లక్షల రూపాయలు లంచం అడిగాడు. కొంతకాలం పాటు లంచం ఇవ్వలేదని, ప్రమోషన్ ఫైల్ తొక్కిపెట్టాడు. కుంటి సాకులు చెప్పి దాటవేస్తూ వచ్చాడు. చివరకు 2 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే ప్రమోషన్ ఇస్తానని బేరం పెట్టాడు.

    ఆ అధికారి సీబీఐకి విషయం మొత్తం వివరించి తనకి సహకరించాలని కోరాడు. దీంతో సీబీఐ అధికారులు వలపన్ని 2 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టేశారు. బాధితుడు కూడా ఐఏఎస్ హోదాలో ఉన్నవాడే కావడం విశేషం. సీబీఐ ఆ తర్వాత పరంజీత్ సింగ్ ఇల్లు, కార్యాలయాలపై దాడులు చేస్తే 30 లక్షల రూపాయలు చిక్కాయి. మొదట 5 లక్షల రూపాయలు లంచం అడిగాడని, ఆ తర్వాత 2 లక్షలకు తగ్గి వచ్చాడని సీబీఐ అధికారి జోషి చెప్పారు. లంచగొండి ఐఏఎస్ అధికారిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు.

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..