మా ఎన్నికల పోలింగ్ వద్ద హీరో శివబాలాజీ చేయి కొరికిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమపై పోలీసు కేసు నమోదు కానుంది. నిన్న ఆమె తన చేతిని కొరికిన తరువాత శివబాలాజీ నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళాడు. జరిగిన విషయం చెప్పాడు. దీంతో వైద్యులు ఆయనకు చికిత్స చేసి , దీనిని మెడికో లీగల్ కేసుగా నమోదు చేశారు.
మెడికో లీగల్ కేసులో రిపోర్ట్ పోలీసులకు వెళుతుంది. పోలీసులు కేసునమోదు చేయాల్సిఉంటుంది. దీనిపై పోలీసులు విచారణ చేయాల్సిఉంటుంది. గాయం తీవ్రతనుబట్టి కేసు నమోదు చేస్తారు. చిన్న గాయం అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేస్తారు. అందువల్ల ఇప్పుడు హేమపై కేసు నమోదు అనివార్యం..చిన్న గాయమే కాబట్టి రాజీ పడితే అంతా సర్దుకుంటుంది. తనను పోలింగ్ కేంద్రంలోకి పోనీయకుండా చెయ్యి అడ్డం పెట్టినందుకే , శివబాలాజిని కొరికానని హేమ చెప్పిన విషయం తెలిసిందే..