విదేశాలనుంచి బంగారం స్మగ్లింగ్ లో , స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త టెక్నీక్ లు కనిపెడుతున్నా , కస్టమ్స్ అధికారులు వాటిని పసిగట్టేసి పట్టేస్తుంటారు. అయినా నిరంతర విద్యార్థుల్లా , స్మగ్లర్లు పట్టువిడవకుండా అక్రమాలు చేసి చిక్కిపోతుంటారు..
ఇప్పుడు ఏకంగా రైస్ కుక్కర్ లో , హీటింగ్ ఎలెమెంట్ ని , బంగారంలో పోతపోసి , దుబాయ్ నుంచి తెచ్చుకున్నారు. రైస్ కుక్కర్ బరువు చూసిన లక్నో ఎయిర్ పోర్ట్ అధికారులకు అనుమానమొచ్చి , విప్పిచూస్తే , ఒక కిలో బరువైన బంగారంతో , కుక్కర్లో హీటింగ్ ఎలిమెంట్ చేసి , దాన్ని లోపలే ఫిక్స్ చేసి పంపారు.. ఈ బంగారం విలువ 55 లక్షల రూపాయలు..