బాయ్ ఫ్రెండ్స్ తో తండ్రిని చంపించింది..

    0
    1093

    17 ఏళ్ళ కూతురు , తన బాయ్ ఫ్రెండ్ , మరో ముగ్గురు స్నేహితులతో తండ్రిని దారుణంగా చంపించింది. బెంగుళూరు ఎలహంకలో ఈ ఘోరం చోటుచేసుకుంది. అరుణ్ వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు ప్లస్ టు చదువుతొంది. చిన్న కూతురు 8 వ క్లాస్ .. మూడు రోజుల క్రితం , తల్లి ఇంట్లోలేని సమయంలో అర్ధరాత్రి , నలుగురు యువకులు ఇంట్లోకి వచ్చి , సుత్తితో అరుణ్ తలపై కొట్టి , తర్వాత గొంతుకోసి చంపేశారు. పక్కింటి వాళ్ళిచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.

    విచారణలో తండ్రిని తన స్నేహితులే చంపేశారని పెద్ద కూతురు చెప్పింది. తండ్రి తనను లైంగికంగా వేధిస్తున్నాడని , అందుకే తన ఫ్రెండ్స్ కి చెప్పి చంపమన్నానని తెలిపింది. తల్లికూడా , కూతురు వాదననే సమర్ధించింది. అయితే కూతురు చెప్పిన దాంట్లో నిజమెంతో దర్యాప్తుచేస్తున్నామని పోలీసులు తెలిపారు. కూతురు , బాయ్ ఫ్రెండ్స్ వ్యవహారం తెలిసి , తండ్రి మందలిస్తే , చంపించిందేమో అన్న అనుమానం కూడా ఉంది.. పెద్ద కూతురిని , నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ని , పోలీసులు బాల నేరస్తుల కోర్టుకి పంపారు..

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.