ఒక విమానం మంటల్లోచిక్కి కూలిపోతే ఒక్కరైనా బ్రతికే అవకాశం ఉందా..? ఖచ్చితంగా లేదు.. అయితే మన ఊహలను తల్లకిందులు చేస్తూ ఈ విమానప్రమాదంలో అందరూ క్షేమంగా బయటపడ్డారు. మొత్తం 21 మంది మృత్యువుని ఛాలెంజ్ చేశారు.. హౌస్టన్ విమానాశ్రయం నుంచి నిన్న ఒక ప్రయివేట్ విమానం బయలుదేరింది. టేకాఫ్ లోనే ఫెన్సింగ్ ని గుద్దుకొని బోల్తా పడింది.. క్షణంలో తగలబడిపోయింది. అలాగే ఈడ్చుకుంటూ , అగ్నిగోళంలా పోయింది. అయితే అదృష్టం ఏమిటంటే విమానంలోని 21 మందిలో ఎవరికీ ప్రాణాపాయం లేదు.. స్వల్పగాయాలతో అందరూ బయటపడ్డారు..
#BREAKING: Plane with 21 people on board crashes near #Houston Executive Airport, everyone survived with only one person injured.pic.twitter.com/KrjOX8ZCe1
— VAJRA: The Strategic Forum™ (@VajraForum) October 19, 2021