వలలో పడ్డ ఒక చేప ఆ మత్స్యకారుడిని లక్షాధికారిని చేసింది.. ఒక్క గంటలో వలలో పడ్డ తెలియబోలియా అనే చేపను తెలుగులో దొంగ చేప అంటారు. పశ్చిమ బెంగాల్ లోని 24 పరాగణాల జిల్లాలో సుందర్ బాన్స్ లో ఈ చేప చీకింది. ఏడు అడుగుల పొడవు ,78 కిలోల బరువుండే ఈ చేప 36 లక్షల , 53 వేలరూపాయలకు అమ్ముడుపోయింది. చేపను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చారు.. ఈ చేపకు ఔషదాలక్షణాలు ఉండటంతో , ఇది ఎప్పుడు చిక్కినా , బంపర్ ధర పలుకుతుంది..
ఇదికాకుండా మరో జాలర్ల సమూహానికి దొరికిన 32 తెలియా చేపలను , వేలం వేస్తే ఒక కోటి రెండు లక్షల రూపాయలు వచ్చింది.. ఈ చేపలు సముద్రంలో సామాన్యంగా చిక్కవు. ఇవి గుంపులుగా తిరుగుతుంటాయి.. విడిపోయినప్పుడే ఇలా వలలో పడుతాయి.. క్యాప్స్యూల్స్ కవర్ కోసం ఈ చేపలు వాడుతారు..