కర్ణాటకలోని బెంగుళూరులో పరప్పన అగ్రహార జైలు అంటే , డబ్బులుంటే సుఖమేసుఖం .. ఎలాంటి నేరంచేసి జైలుకు పోయినా , అడిగింది అందుతుంది.. జైలు గదికూడా డబ్బునుబట్టి వసతులు మారుతుంటాయి.. శశికళ ఈ జైల్లోనే ఫైవ్ స్టార్ హోటల్ మాదిరి గడిపింది. సాక్షాత్తు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అప్పట్లో ఈ జైల్లో అవినీతిపై బహిరంగంగా ప్రకటన చేశారు. తాజాగా , జెసిబి రామస్వామి అనే ఖైదీ , గదిలో సోఫా , టివి , మినరల్ వాటర్ బాటిల్స్ , మొబైల్ .. ఇవన్నీ కాకుండా బయటనుంచి మంచి నాన్ వెజ్ భోజనం , మొబైల్ .. ఇవిచాలదన్నట్టు రోజు జైల్లోనే ఫ్రెండ్స్ తో బాతాఖానీ ,, ఇవన్నీ వీడియో రూపంలో బయటకు రావడంతో ఇప్పుడు హోమ్ మంత్రి విచారణకు ఆదేశాలు ఇచ్చారు..
VIP treatment & corruption at the central prison in Bengaluru continues. Visuals emerge of powerful inmates enjoying perks like TV, Fan, phones and other amenities inside their barracks. Visuals around a year old show jail officials being bribed too. pic.twitter.com/VOcToRew6q
— Deepak Bopanna (@dpkBopanna) January 25, 2022