కడసారిగా తండ్రిని చూసేందుకు..
పునీత్ రాజ్ కుమార్ బిడ్డను చూస్తే కన్నీరు ఆగదు..
=========================
కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా పడ్డాయి. పునీత్ కుమార్తె ధృతి అమెరికా నుంచి రావడం ఆలస్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఆమె కంఠీరవ స్టేడియంకు కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ద్రుతిని చూసిన అభిమానులు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. అయితే తొలుత ఈరోజే పునీత్ అంత్యక్రియలు చేయాలని భావించినా.. ధృతి రావడం ఆలస్యం కావడంతో రేపటికి అంత్యక్రియలను వాయిదా వేశారు. పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతోనే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
#PuneethRajkumar’s daughter, studying in the #US, arrives at #KanteeravaStadium to say goodbye to her dad. pic.twitter.com/jPj0YvGWuw
— Pratiba Raman (@PratibaRaman) October 30, 2021