మృత్యువు ఎప్పుడు ఎటువైపునుంచి ముంచుకొస్తుందో తెలియదు.. కారు టైరుపేలి నలుగురు చనిపోయిన దుర్ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. కారు ముందు టైరుపేలడంతో , ఆ కారు అదుపుతప్పి , ఎదురుగా వస్తున్న ఒక లారీని ఢీకొనింది. ఈ కారు మదనపల్లి నుంచి , అనంతపురం పోతుంది. అక్కడ ఒక వివాహవేడుకలో పాల్గొనాల్సిఉంది. కారులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోగా , మరో చిన్న పాప తీవ్రగాయాలతో ఆసుపత్రిలో ఉంది. మృతులలో తల్లి అమ్మాజీ, కూతురు రేష్మ, అల్లుడు , కొడుకు ఉన్నారు.. వీళ్లంతా చనిపోయారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయాయి. అతి కష్టం మీద శవాలు వెలికి తీశారు..