చెన్నై , హైదరాబాద్, ముంబై ఇలా నగరమేదైనా , స్మగ్లర్లు తగ్గేదెలేదంటున్నారు. కస్టమ్స్ అధికారులు పట్టేస్తున్నా , మళ్ళీ , మళ్ళీ ఏదోఒకవిధంగా స్మగ్లింగ్ కొనసాగిస్తున్నారు. తాజాగా చెన్నైలో , ఓ వ్యక్తి ఐదున్నర కోట్ల రూపాయల , వజ్రాలు , కెంపులు స్మగుల్ చేస్తూ చిక్కిపోయాడు. వీటిని ఒక పాలిథిన్ కవరులో వేసుకొని , అవి సాదా సీదా మెరిసే సింతటిక్ రాళ్ళని చెప్పాడు.
వాటి విలువను నాలుగు లక్షలరూపాయలుగా చూపించాడు. అయితే అధికారుల పరిశీలనలో , అవి సానపెట్టిన అసలు వజ్రాలు , కెంపులని వాటివిలువ ఐదున్నర కోట్లని తేలింది. ఇటీవల మరో స్మగ్లర్ , విలువైన వజ్రాలను , ట్రాలీ బాగ్ హ్యాండీల్లో పెట్టుకొని పోతున్నాడు.. వీటి విలువ ఆరుకోట్ల రూపాయలు.. మరొకడు ఐదు కోట్ల రూపాయల వజ్రాలను తాను వాడుకునే టెలిస్కోప్ హ్యాండీల్లో పెట్టి చిక్కిపోయాడు.
https://www.facebook.com/watch/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&v=548598946438584