సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య , అల్లుడు ధనుష్ విడిపోయారు. 18 ఏళ్ళ వివాహబంధానికి ముగింపు చెబుతున్నామని ఇద్దరూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇంతకాలం తమ భార్యాభర్తల బంధం ముగిసిపోయిందని చెప్పారు. కారణాలు మాత్రం వెల్లడించలేదు. గత కొంతకాలంగా ఇద్దరూ విడిపోతున్నట్టు వార్తలొచ్చినా , అవి పుకార్లని కొట్టేశారు. చివరకు వాటిని నిజంచేస్తూ ఇప్పుడు ఇద్దరూ విడిపోతున్నట్టు ప్రకటించారు. తమ గోప్యతను కాపాడుకునేందుకు సహకరించాలని కోరారు..