తల్లి అన్న పదానికే మచ్చ తెచ్చిన నీచురాలు.. కన్నకూతురినే కసాయి మగాళ్లకు అప్పజెప్పిన కిరాతకురాలైన తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని పాతనమిట్ట జిల్లా అరనమూరులో ఓ తల్లి తన 14 ఏళ్ళ కూతురిని , తన ప్రియుడితో పంపించింది. షాపింగ్ కు తీసుకెళతాడు పొమ్మని చెప్పింది. అయితే , మధ్యలో మరో వ్యక్తి వీళ్లకు జతకలిశాడు. బాలికను ఒక తోటలోని గెస్ట్ హౌస్ లో ఉంచి , ఆ బాలిక తల్లి ప్రియుడు , అతడి స్నేహితుడు అత్యాచారం చేశారు. ఈ విషయం తోటలోని కాపలాదారు , తల్లి ఇల్లు ఉండే ప్రాంతంలో ఒక రాజకీయనాయకుడికి చెప్పాడు. పోలీసులు అక్కడకి పోయే సమయానికి ఘోరం జరిగిపోయింది. బాలిక నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు , ఆ బాలిక తల్లిని , ఆమె ప్రియుడిని , అతడి స్నేహితుడిని అరెస్ట్ చేశారు.. బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించారు..
ఇవీ చదవండి..
ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?
అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?