ఆహారపదార్ధాలే కల్తీ అయిపోతున్న ఈ రోజుల్లో… కొందరు నీచులు మరింత నీచానికి పాల్పడుతున్నారు. తినే పదార్ధాల్లో మురికి నీళ్ళు కలిపేవాడు ఒకడైతే.. పానీపూరిలో ఉపయోగించే నీటిలో మూత్రం పోసేవాడు మరొకడు. రోటీలు తయారు చేసే గోధుమ పిండిని కాలితో తొక్కేవాడు ఒకడైతే… వాటి మీద ఉమ్మి వేసి తయారు చేసేవాడు ఇంకొకడు. ఇలా నికృష్టపనులు చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. చివరికి వాళ్ళ పాపం పండి.. ఊచలు లెక్కబెడుతున్నారు. అలాంటి ఘటనే ఇది కూడా.
ఘజియాబాద్ లో తమిజుద్దీన్ అనే వ్యక్తి రోటీలు తయారు చేస్తుంటాడు. అతను తయారు చేసే ప్రతి రోటీ మీద ఉమ్మి వేస్తున్నాడు. దాన్ని కాల్చి విక్రయిస్తున్నాడు. ఇలా ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు కానీ… వాడి పాపం సోషల్ మీడియా ద్వారా బయటపడింది. ఇక వాడు చేసిన నీచమైన పని తెలియడంతో పోలీసులు వాడిని పట్టుకుని బొక్కలోకి నెట్టారు.
गाजियाबाद के एक चिकन पॉइंट का वीडियो सामने आया है, जिसमें एक शख्स थूक लगाकर रोटी बनाता दिख रहा है. pic.twitter.com/utDi9Jh9F8
— Anubhav Veer Shakya (@AnubhavVeer) October 17, 2021