కారు వంతెనపైనుంచి పడి , ఏడుగురు మెడికల్ విద్యార్థులు మరణించారు. మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో ఈ ఘోరం జరిగింది. మెడికల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు , వార్ధా – ధియోలి రోడ్డులో రాత్రి 12 గంటల సమయంలో వేగంగా పోతూ , బిడ్జిపై అదుపు తప్పి , 40 అడుగుల లోతులో పడిపోయింది. సెల్సురా అనే ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఒక స్నేహితుడి ఇంట్లో విందుకు పోయి తిరిగి వస్తుండగా , ఈ దారుణం జరిగింది. మృతులలో బిజెపి ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నారు.