ఉగాది నాటికీ ఆంధ్ర రాష్ట్ర స్వరూపం మారిపోనుందా.. ? రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు నాంది జరగనుందా.. ? నిజమేనని చెబుతున్నారు. ఉగాది రోజున రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధి ఒక జిల్లాగా మారనుంది. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు , 26 జిల్లాలు కానున్నాయి. దీనికోసం నోటిఫికేషన్ కూడా జారీచేయనున్నారు. గత ఎన్నికల సమయంలో , పాదయాత్రలో , కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ అనేక సభలలో హామీ ఇచ్చారు. దీనిప్రకారమే ఇప్పడు కొత్త జిల్లాల ఏర్పాటు జరగనుంది. పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రమే , కొత్త జిల్లా కేంద్రం కానుంది. ప్రస్తుతం అక్కడుండే , భవన వసతిని కొత్త జిల్లా కేంద్రం కార్యాలయాలుగా వాడనున్నారు. ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రాధమికంగా నోటిఫికేషన్ ఇస్తారు. తర్వాత ప్రజలనుంచి , అభిప్రాయాలు , అభ్యంతరాలు స్వీకరిస్తారు. గడువుముగిసిన తరువాత , వాటిపై పరిశీలన చేసి , కొత్త జిల్లాల నోటిఫికేషన్ విడుదల చేస్తారు..