పళ్ళు తోమకుండా బిడ్డను ముద్దుకున్నాడని భార్య అడిగినందుకు , భర్త ఆమెను చంపేశాడు.. ఈ ఘోరం కేరళలోని పాలక్కాడ్ లో జరిగింది. అవినాష్ , దీపికా భార్యాభర్తలు.. వారికి రెండున్నరేళ్ల కొడుకున్నాడు, మంగళవారం ఉదయాన్నే , భర్త బ్రష్ చేసుకోకుండా , బిడ్డను ముద్దుపెట్టుకున్నాడు. దీన్ని భార్య వద్దని వారించింది. ఈ విషయమై ఇద్దరి మధ్య మాట , మాటా పెరిగింది. అవినాష్ , ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని , భార్యను పొడిచి చంపేశాడు. పోలీసులు అవినాష్ ని అరెస్ట్ చేశారు..