వాడి శాడిస్ట్ ..పెళ్లికాకముందే ఆమె జీవితాన్ని కాటేశాడు. కాటికిపంపేసాడు. హుబ్లీకి చెందిన పవిత్రా పాటిల్కు హావేరికి చెందిన అభినందన్ అనే యువకుడితో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. డిసెంబరు 2న వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం దాండేలికి వెళ్లారు. తిరిగి వచ్చినప్పటినుంచి పెళ్లికాకుండానే వేధింపులు మొదలయ్యాయి..
ఆమెపై అనుమానాలు పెరిగాయి. రకరకాలుగా ఆమెను అనుమమానంతో వేధించసాగాడు , దీంతో పవిత్ర కుటుంబ సభ్యులకు తెలియజేసింది. పెళ్లి జరిగితే అన్నీ సర్దుకుంటాయని ఓదార్చారు. తీవ్ర వేదనకు గురైన పవిత్ర శుక్రవారం తన ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అశోక్నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.