భారీ వర్షాల కారణంగా , కన్నూర్ – బెంగుళూరు రైలుపై బండరాళ్లు పడి , ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు..
నిన్న సాయంత్రం 6 గంటలకు , కేరళలోని కన్నూర్ నుంచి బయలుదేరిన రైలు , సేలం సెక్షన్ లో , టొప్పుర్ – శివాడి మధ్య , కొండచరియలు ఆనుకుని ఉన్న రైల్వే లైన్ పై పోతుండగా , వేకువనే 4 గంటల సమయంలో భయంకరమైన శబ్దంతో , కొండపైనుంచి , బండరాళ్లు విరిగిపడ్డాయి.
ఆ సమయంలో రైల్లో 2 వేలమంది ప్రయాణీకులు ఉన్నారు.. ఐదు బోగీలు పట్టాలు తప్పినా , ప్రయాణీకులకు ప్రమాదరమేమి జరగలేదు.. ప్రయాణీకులను బస్సులలో తరలించారు..
ప్రస్తుతానికి ఆ సెక్షన్ రైళ్ల రాకపోకలను రద్దు చేశారు.. గత కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాలకు మట్టి కరిగి , ఇంట పెద్ద బండరాళ్లు బోగీలపై పడ్డాయి..