తిరుపతి లోక్ సభ స్థానానికి జరగబోతున్న ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి బరిలో దిగబోతున్నారు. ఈమేరకు బీజేపీ, జనసేన మధ్య ఒప్పందం కుదిరింది. సునీల్ దియోధర్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా దీన్ని ధృవీకరించారు. అయితే బీజేపీ తరపున బరిలో దిగే అభ్యర్థి ఎవరో తేలాల్సి ఉంది.
తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అందరికంటే ముందుగా ఉప ఎన్నికలకోసం టీడీపీతమ అభ్యర్థిని ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఇక్కడ టీడీపీ తరపున పోటీలో దిగుతారు. ఇక వైసీపీ తరపున ఫిజియో థెరపిస్ట్ గురుమూర్తిని వైసీపీ ఖరారు చేసింది. అయితే అధికారికంగా ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇక బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిపై ఇంతవరకూ సందిగ్ధత నెలకొంది, తాజాగా.. రెండు పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చి బీజేపీ గుర్తుపై అభ్యర్థిని బరిలో దించబోతున్నాయి.
ఇవీ చదవండి…
అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..
భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..
ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..
ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??