అల్లుడిపై మోజుతో క‌ట్టుకున్న భ‌ర్త‌నే..

    0
    2174

    అల్లుడిపై మోజుతో క‌ట్టుకున్న భ‌ర్త‌నే క‌డ‌తేర్చింది ఓ కిరాత‌క‌ భార్య‌. కూతురి భ‌ర్త‌తో మూడేళ్ళుగా ర‌హ‌స్యంగా అక్ర‌మసంబంధం పెట్టుకుని, ప‌ధ‌కం ప్ర‌కారం భ‌ర్త‌ను అడ్డుతొల‌గించింది. అయితే పోలీసుల ద‌ర్యాప్తులో అస‌లు నిజం బ‌య‌ట‌ప‌డ‌డంతో అల్లుడితో పాటు అత్త కూడా క‌ట‌క‌టాల వెన‌క్కి వెళ్ళింది. ఈ ఘ‌ట‌న చిత్తూరు జిల్లాలో జ‌రిగింది. ఐరాల మండలం రంగయ్యచెరువు ఎస్టీకాలనీకి చెందిన నాగరాజు, మంజుల భార్యాభ‌ర్త‌లు. త‌మ కుమార్తె రాణిని బంగారుపాళ్యం మండలం చిట్టేరి ఎస్టీ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యానికి ఇచ్చి వివాహం చేశారు. అయితే మంజుల త‌న అల్లుడు సుబ్రహ్యణ్యంతో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది.

    భ‌ర్త‌ను అడ్డుతొల‌గించుకుంటే త‌మ సంబంధానికి ఏ అడ్డంకి ఉండ‌ద‌నుకుని, అత్తాఅల్లుడు ప‌ధ‌కం వేవారు. ఇద్దరూ కలిసి నాగ‌రాజును కంచెంవారిపల్లె సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి, క‌ర్ర‌ల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టి చంపేశారు. వడ్లవాణి కుంటలో పడేసి అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. నీటిలో తేలుతున్న శవాన్ని స్వాధీనం చేసుకొన్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే పోస్టుమార్టంలో ఇది హ‌త్య అని తేల‌డంతో, పోలీసులు ఆ దిశ‌గా ఆరా తీశారు. తీగ లాగితే డొంకంతా క‌దిలిన‌ట్లు అత్తాఅల్లుడి అక్ర‌మ‌సంబంధం వెలుగులోకి వ‌చ్చింది. దీంతో నిందితులిద్ద‌రినీ పోలీసులు అరెస్టు చేశారు.

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?