నిమ్మగడ్డ నిర్ణయం భేష్.. అదే సిస్టమ్ ఫాలో అవుతాం..

    0
    381

    ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో ఆల్రడీ కోడ్ అమలులో ఉన్నట్టు స్పష్టం చేశారు ఎస్ఈసీ నీలం సాహ్ని. ఆల్ పార్టీ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పార్టీల సహకారం కోరారు. ఈరోజునుంచి ప్రచారం చేసుకోవచ్చని, ఓటింగ్ కి ముందురోజు ప్రచారం ఆపేయాలని సూచించారు. గత ఎన్నికల విషయంలో తీసుకు వచ్చిన సిస్టమ్ బాగుందని, దాన్ని అలాగే కంటన్యూ చేస్తామని అన్నారు. ప్రతి జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్ ని నియమించి, ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

    ఇవీ చదవండి

    మందుబాబులు వాక్సిన్ వేసుకోవచ్చా..?

    మాస్క్ లేకపోతె మోకాళ్ళమీద నడిపిస్తారు.

    నౌకను చంద్రుడు కదిలించాడు..

    బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే.