బద్వేల్ లో ఉప ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. అధికార వైసీపీదే అక్కడ విజయం అని చెబుతున్నా.. బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తామంటోంది. అయితే వైసీపీ ఓటమి భయంతో దొంగఓట్లు వేయించుకుంటోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ అధికారిక ట్విట్టర్ లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. దొంగఓట్లతో వైసీపీ గెలవాలని చూస్తోందని విమర్శిస్తున్నారు.
ఇది జగన్ రెడ్డి గారి ప్రజాదరణ!
బద్వేల్ లో ఓట్లు వేసేవారు లేక పక్క జిల్లాల నుంచి తెచ్చుకుంటున్నారు
ఇలాంటి గెలుపు కూడా ఒక గెలుపేనా?అట్లూరు మండలంలో పోలీసులు వైసిపి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు#BadvelByPollComplaints @ECISVEEP @CollectorKadapa @dgpapofficial pic.twitter.com/HwDQLjmyup
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) October 30, 2021