కొన్నాళ్లుగా ఆ ఇంట్లో వదిన, ఆడబిడ్డకు ఇద్దరికీ పిల్లలు లేరు. 12 ఏళ్ల తర్వాత వదినకు లేకలేక మగసంతానం కలిగింది. అయితే ఆడబిడ్డ అక్కసు పెంచుకుంది. తన కడుపు పండలేదని, వదినకు మగబిడ్డ పుట్టాడని ఈర్ష్యతో విషం కక్కింది. మేనల్లుడు అనే కనికరం లేకుండా, రెండు నెలల చిన్నారి అనే జాలి కూడా లేకుండా చంపేసింది. ఈ సైకో మేనత్త వ్యవహాన్ని రెండు రోజుల్లోనే పోలీసులు ఛేదించారు.
హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని అనాజ్ పూర్ లో రెండు నెలల పసికందు హత్యకు గురైన కేసులో మేనత్త శ్వేత నిందితురాలని తేల్చారు పోలీసులు. ఈ హత్యకు ఆమె భర్త నాగరాజు కూడా సహకరించడం మరీ దుర్మార్గం. రెండేళ్లయినా తమకు పిల్లలు కలగలేదని, తన వదినకు పిల్లలు పుట్టారనే అక్కసుతో శ్వేత ఈ పని చేసినట్టు తెలుస్తోంది.
ఎల్బీనగర్ లో ఉండే లత, తిరుమలేశ్ దంపతులకు లేకలేక సంతానం కలిగింది. ఈ క్రమంలో రెండు నెలల వయసున్న తన బిడ్డను తీసుకుని అనాజ్ పూర్ లో సొంత ఇంటికి వెళ్లింది. బిడ్డకు పాలిచ్చి తన పక్కన పడుకోబెట్టుకుంది తల్లి. తెల్లారి లేచి చూసే సరికి పిల్లవాడు పక్కనలేడు. ఇరుగు పొరుగుతో కలసి వెదకగా ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్ లో శవమై కనిపించాడు కొడుకు. పోలీసుల విచారణలో మేనత్తే హంతకురాలని తేలింది.