ఏపీలో పది, ఇంటర్ పరీక్షల విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్. నారో లోకేష్కు ఉన్నట్టు విద్యార్ధులందరికీ చంద్రబాబు లాంటి తండ్రి లేడని చెప్పిన మంత్రి… విదేశాల్లో చదువుకునేందుకు సాయం చేసే సత్యంరామలింగరాజు లాంటి స్పాన్సర్లు కూడా ఉండరని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహించి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. టెన్త్ పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపక్ష పార్టీల డిమాండ్ సరికాదన్నారు. పది పరీక్షలు రద్దయ్యాయని చెబుతూ ఇంటర్ అడ్మిషన్లు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి సురేష్.