కామంతో కళ్ళుమూసుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి జీవితం చివరకు ఆత్మహత్యతో అంతమైంది. 37 ఏళ్ళ వయసున్న నందిని ఓ మహిళకు ముగ్గురు బిడ్డలు.. భర్తతో సంతోషంగా జీవితం గడుపుతున్న సమయంలో , 16 ఏళ్ళ బాలుడితో అక్రమసంబంధం పెట్టుకుంది. భర్తను , బిడ్డలను వదిలేసి , ఆ బాలుడితో లేచిపోయింది.
ఉత్తరప్రదేశ్ లోని గుంజి అనే ప్రాంతంలో కాపురంపెట్టింది. అయితే , ఒకటిన్నర నెలకే , ప్రియుడైన ఆ బాలుడు పారిపోయాడు. దీంతో దిక్కుతోచక మళ్ళీ భర్త , బిడ్డలదగ్గరకొచ్చింది. అయితే ఆమెను మళ్ళీ తనజీవితంలోకి అడుగుపెట్టేందుకు లేదని , భర్త చెప్పేసాడు. ఆమె తల్లితండ్రులు కూడా రానీయలేదు. దీంతో గుగ్లీ స్మశానంలో , ఒక చెట్టుకు ఉరేసుకొని చనిపోయింది. తాను తప్పుచేశానని , అందుకు పశ్చత్తాప పడుతున్నానంటూ లేఖరాసి చనిపోయింది..