శ్రీకాకుళం నగరంలో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. బాపూజీ కళామందిర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు వేదికపైకి వచ్చి, ఎంపీ రామ్మోహన్ నాయుడు కూర్చున్న సోఫాలో పక్కనే కూర్చున్నారు. వెంటనే సోఫా విరిగిపోవడంతో రామ్మోహన్, అచ్చెన్నాయుడు వెనక్కి పడిపోయారు. అప్రమత్తమైన నిర్వాహకులు వారిని పైకిలేపి మరో కుర్చీని ఏర్పాటు చేశారు.