దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది.. అయితే దసరా పండుగ ఉత్సవాలలో ప్రజల కదలకిలను నియంత్రించకపోతే , ఇది మళ్ళీ విశ్వరూపం చూపించవచ్చు. ప్రస్తుతానికి , 209 రోజులలో మొదటిసారిగా 18, 346 కొత్త కేసులు నమోదయ్యాయి.. వీటిలో కేరళలోనే ఎక్కవ కేసులున్నాయి. ఇప్పటివరకు ఇంట తక్కువ కేసులు నమోదు కాలేదు. దీన్ని బట్టి గతకొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నా , దసరా వేడుకల్లో అప్రమత్తంగా ఉంటే , ప్రమాదం తప్పిపోతుంది. ఇప్పటివరకు 11 రోజుల వ్యవధిలో కరోనా కేసులు 30 వేలకు దిగువన ఉండటం ఇదే మొదటిసారి. ప్రస్తుతానికి యాక్టీవ్ కేసులు 2లక్షల 52 వేలు ఉన్నాయి. మనదేశంలో కరోనా యెంత వేగంగా పెరిగిందో చూడండి.. 2020 ఆగస్టు 7న 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు , సెప్టెంబర్ 5న 40 లక్షలు , సెప్టెంబర్ 16 న 50 లక్షలు, సెప్టెంబర్ 28న 60 లక్షలు , అక్టోబర్ 11న 70 లక్షలు , నవంబర్ 20న 90 లక్షలు , డిసెంబర్ 19 న కోటి , మే న 2 కోట్లు , జూన్ 23న 3 కోట్లు దాటింది.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది..