పెళ్ళిలో.. హీరో హీరోయిన్లు..ఆశ్చర్యపోయిన వధూవరులు..
వరుడు కావలెను.. ఈ టాలీవుడ్ మూవీలో నాగసౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్ కార్యాక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో జరుగుతున్న పలు పెళ్లిళ్లకు హీరో నాగసౌర్య, హీరోయిన్ రీతూ వర్మ హాజరయ్యారు.
వధూవరులతో ఫోటోలు కూడా దిగారు. దీంతో అనుకోని అతిధులను చూసి పెళ్లికి వచ్చిన వారంతా అవాక్కయ్యారు. ఏదిఏమైనా ఇలా వెరైటీగా తమ సినిమాను ప్రమోషన్ చేసుకోవడం విశేషమే.