T -20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ విజయంతో తన భార్య సంబరాలు జరుపుకుందని , ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్యతోపాటు , మామ , బావమరుదులు కూడా ఈ సంబరాల్లో పాల్గొని , దానికి సంబందించిన వీడియోలు వాట్సాప్ లో పెట్టారని చెప్పాడు. ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ లో ఉండే ఇషాన్ మియా అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేసాడు. T -20 వరల్డ్ కప్ లో ఇండియాపై పాకిస్తాన్ విజయాన్ని ఇలా సంబరాలు చేసుకోవడం దేశద్రోహం అవుతుందని కూడా తాను చెబితే వినలేదని అన్నారు. వాళ్ళు టపాకాయలు కాల్చి , మిఠాయిలుకూడా పంచుకున్నారని చెప్పారు. ఇవన్నీ వీడియో సాక్ష్యాలతో పోలీసులకు ఇచ్చాడు. భర్త , ఇషాన్ మియా ఫిర్యాదు మేరకు , ఆయన భార్య రాబియాపై , ఆమె తండ్రి , సోదరులపై కేసు పెట్టమని ఎస్పీ అంకిత్ మిట్టల్ చెప్పారు..