హైదరాబాద్ లో 14 మంది మహిళలు పునరావాస కేంద్రం నుంచి పరారీ కావడం సంచలనం సృష్టించింది. హైదరాబాద్ లోని హైదర్షాకోటి లో , కస్తూరిబా నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ కు సంబందించిన రెస్క్యూ హోమ్ ఉంది. దీనిలో 30 మంది మహిళలు ఉంటున్నారు. వీరిలో 14 మంది రాత్రి రెండుగంటల సమయంలో , బాత్రూం లో వెంటిలేటర్ ఉంచి , బిల్డింగ్ సన్ షెడ్ పైకి చేరుకున్నారు. అక్కడనుంచి కిందకు దూకి, తరువాత , సోలార్ ఫెన్సింగ్ ఉన్న గోడ దూకిపారిపోయారు.
ఇంత దైర్యంగా వీళ్లంతా రాత్రికిరాత్రి , ది గ్రేట్ ఎస్కెప్ సినిమాలో మాదిరి పారిపోవడం సంచలనం కలిగించింది. వెంటిలేటర్ నుంచి పారిపోవాలంటే , కిటికీ ఎక్కి , దానినుంచి వెంటిలేటర్ లోకి దూరాల్సిఉంది.. ఆ తరువాత విద్యుత్ సరఫరా ఉన్న , కాంపౌండ్ ఫెన్సింగ్ ని ఎక్కి , దాటాల్సిఉంది.. కరుడుగట్టిన నేరస్తులకే అలవికాని పని , 14 మంది మహిళలు సులభంగా చేసి తప్పించుకోవడం విశేషం.. వీడియో చూడండి..