పెళ్లి చేసుకోనన్న ప్రియుణ్ణి చంపేసి సూట్ కేసులో కుక్కేసింది , ప్రీతి శర్మ అనే ప్రియురాలు.. ప్రీతికి పెళ్ళై , నాలుగేళ్ల క్రితం భర్తతో విడిపోయి విడాకులు తీసుకుంది. 23 ఏళ్ళ ఫిరోజ్ తో పరిచయం , అక్రమసంబందానికి దారితీసింది. రెండేళ్లు ఇద్దరూ కలిసే ఉన్నారు. ఫిరోజ్ ని పెళ్లిచేసుకోమని కోరింది. అయితే , మతాంతర వివాహానికి తన తల్లితండ్రులు ఒప్పుకోరని చెప్పాడు. పైగా , మొగుణ్ణి వదిలేసిన , నిన్ను చేసుకోలేనని చెప్పేసాడు.
దీంతో ఫిరోజ్ పై పగపెంచుకున్న ప్రీతి , అతడితో మామూలుగా ఉంటూనే , నాలుగు రోజుల క్రితం భోజనంలో మత్తుకలిపి ఇచ్చి , నిద్రపోయాక , చంపేసింది. తరువాత పెద్ద ట్రాలీ సూట్ కేసులో , ఫిరోజ్ శవాన్ని కుక్కేసింది. సమీపంలోని , రైల్వే స్టేషనుకి తీసుకెళ్లి , ఏదో ఒక రైల్లో పెట్టి , తప్పించుకోవాలని చూసింది. అయితే , సూట్ కేసు లాక్కుపోతున్న , ప్రీతిని , ఓ కానిస్టేబుల్ అదేమిటని అడిగితే , సమాధానం చెప్పేందుకు తడబడింది. దీంతో సూట్ కేసు తెరిచి చూడటంతో శవం బయటపడింది. ప్రీతిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.. ఈ సంఘటన ఘజియాబాద్ లో జరిగింది..