భర్తలను చంపే భార్యల్లో మైసూరులో ఓ భార్య కొత్త టెక్నిక్ కనిపెట్టింది. వెంకట్ రాజు అనే 50 ఏళ్ల మరణం వెనక మిస్టరీని 8 నెలల తర్వాత పోలీసులు చేధించారు. వెంకట్ రాజు పోస్టుమార్టం రిపోర్టు ఆలస్యంగా రావడంతో పోలీసుల విచారణ, వారం క్రితమే ప్రారంభమైంది. పోస్టుమార్టం రిపోర్టులో వెంకట్ రాజుకి మత్తుమందు ఇచ్చి ఆయన మర్మాంగాలను, వృషణాలను నలిపేయడం వల్ల మరణం సంభవించిందని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఉమా అనే మహిళతో వెంకట్ రాజుకి పదేళ్ళ క్రితం వివాహం జరిగింది. వెంకట్ రాజు కంటే ఉమ 20 ఏళ్ళ చిన్నది. వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
మాండ్యాలో ఆమె తల్లిదండ్రుల ఇంటి పక్కన ఉండే అవినాష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్రమసంబంధానికి దారి తీసింది. దీంతో తరచూ ఆమె తల్లిదండ్రుల ఇంటికి వచ్చిపోతుండేది. ఓ రోజు వెంకట్ రాజును తన బన్నూరులోని తన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానని, అక్కడికి రావాలని భర్తకు చెప్పింది. తన భర్తకు తలనొప్పి వచ్చిందని చెప్పి పడుకుండిపోయాడని ఉమ తన బంధువులకు చెప్పింది. అయితే అదే రోజు రాత్రి మత్తుమందు కలిపిన పాలు భర్తకు ఇచ్చింది.
పాలు తాగి పడుకున్న తర్వాత భర్త వృషణాలను నలిపి చంపేసింది. ముఖం మీద దిండు అదిమి ఊపిరి ఆడకుండా చేసింది. వెంకట్ రాజు తమ్ముడికి అనుమానం రావడంతో శవాన్ని పోస్టుమార్టంకి తరలించారు. నివేదికతో ఇది హత్యగా తేల్చిన పోలీసులు… ఉమాను అదుపులోకి విచారణ చేపట్టారు. ఇదంతా తన ప్రియుడు సలహా మేరకు తాను ఒక్కదాన్నే చేశానని ఒప్పుకుంది.
ఇవీ చదవండి..
ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?
అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?