ఎవరైనా ఆకలితో ఉన్నామని చెపితే , ఆ దేవాలయం తలుపులు మూతపడవు . ఆ భక్తుడికి అన్నంపెట్టిన తరువాతే దేవాలయం తలుపులు మూసేస్తారు. ఇది కొట్టాయంజిల్లా వైకోమ్ లో శివాలయం. ప్రతి రోజు రాత్రి దేవాలయం తలుపులు మూసేముందు పూజారులు ఎవరైనా ఆకలితో ఉన్నారా అని అడిగి , ఆ తరువాతనే ఆలయం తలుపులు మూసేస్తారు. గత వందల ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతుంది .
దేవాలయానికి నాలుగు ద్వారాలుంటాయి. ప్రతిరోజూ ఆలయం మూసే సమయంలో పూజారి , దివిటీతో నాలుగు ద్వారాల దగ్గరికెళ్లి , పెద్దగా మీలో ఎవరైనా ఆకలితో ఉన్నారా అని మూడు సార్లు అడుగుతాడు. ఎవరైనా ఆకలిగా ఉందని చెప్తే అన్నంపెట్టి , ఆకలి తీర్చిన తరువాతే దేవాలయం మూసేస్తారు. ఇక్కడ శివలింగాన్ని త్రేతా యుగంలో ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి. వైష్ణవులు , శైవులు ఇద్దరూ వైకోమ్ శివుణ్ణి సమంగా ఆరాధిస్తారు.
ఇవీ చదవండి:
భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..
ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??
ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..