హైవే ఎక్కితే.. దూల తీరిపోద్ది..
ఫాస్టాగ్ కు గుడ్ బై చెప్పనున్న కేంద్రం..
==========================
కారు ఉంది కదా అని హైవే ఎక్కితే దూల తీరిపోద్ది.. ఎందుకంటే ఇకపై కేంద్రం హైవేపై వసూలు చేస్తున్న టోల్ విధానంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ టోల్ గేట్ వద్ద మాత్రమే టోల్ చార్జీ వసూలు చేసేవారు. అయితే సరికొత్త విధానంలో టోల్ ప్లాజాలను ఎత్తివేయనున్నారు. టోల్ ప్లాజా లేకపోయినా వాహనదారులనుంచి చార్జీలను వసూలు చేస్తారు.
ఎలా అంటే.. మన వాహనం హైవే ఎక్కితే చాలు GPS ద్వారా సమాచారం తెలిసిపోతుంది. అంతే మనం ఎక్కడనుంచైతే హైవే ఎక్కామో.. అక్కడి నుంచి హైవే దిగే వరకూ ఎన్నికిలోమీటర్లు ప్రయాణించామో దానిని బట్టి మన అకౌంట్ లో నగదు కట్ అవుతుంది. ఈ కొత్త విధానం వలన కేంద్రానికి భారీగా ఆదాయం రానుంది. ఎందుకంటే ఇప్పటివరకూ టోల్ ప్లాజాల రాకముందు వరకూ మనం ఉచితంగానే ప్రయాణించేవాళ్ళం.. అయితే ఏ సరికొత్త విధానం వలన వాహనదారుల జేబుకు మరింత చిల్లు పడనుంది.
ఏడాది లోగా ఈ సరికొత్త విధానంలోకి పూర్తి స్థాయిలో మారాలని రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. GPS శాటిలైట్ టెక్నాలజీ ఆదారంగా టోల్ వసూళ్లకు అధికారులు రంగం సిద్ధం చేయబోతున్నారు.