స్కూటీలో టపాకాయల పేలుడు ఇలా జరిగింది..

    0
    4413

    బైక్ లో టపాకాయలు తీసుకుపోతూ జరిగిన భారీ పేలుడులో ఇప్పుడు నిజాలు బయటకొస్తున్నాయి.. చనిపోయిన వ్యక్తి అరియాకుప్పంకు చెందిన కలియనేషన్ , అతడి ఏడేళ్ల కొడుకు.. దీపావళికి టపాకాయలు అమ్ముకునేందుకు , పాండిచ్చేరినుంచి రెండు బస్తాల్లో నాటు టపాసులు తెచ్చాడు. వీటిని శక్తివంతమైన పేలుడు ఉండేట్టు తయారుచేస్తారు. రెండు బస్తాల , నాటు టపాసులను , స్కూటీ ముందు , ఒకదానిపై ఒకటి ఉంచి , వాటిమీద తన ఏడేళ్ల బిడ్డను కూర్చోబెట్టాడు. వీటిని అమ్ముకునేందుకు బయలుదేరి కోటకుప్పం వద్దకొచ్చాడు. టపాకాయలమీద వత్తిడి , స్కూటీ ఇంజిన్ నుంచి వచ్చిన వేడి , కారణంగా ఇంత భారీ స్థాయిలో పేలుడు జరిగిందని నిర్థారించారు. ఈ పేలుడులో తండ్రి , కొడుకుల శవాలు 15 అడుగుల ఎత్తు ఎగిరాయి.. పేలుడు జరిగిన స్కూటీ పక్కనేపోతున్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలై , వారుకూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు..

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..