కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కి ఓ అలవాటు ఉంది. తానెవరో తెలియకుండా అభిమానుల్ని సర్ ప్రైజ్ చేస్తుంటారు. యువరత్న సినిమా ప్రమోషన్ విషయంలో కూడా ఆయన ఇలాగే చేశారు. వెనకనుంచి వచ్చి అభిమానుల్ని సర్ ప్రైజ్ చేసేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ వీడియోలు ఇప్పుడు బాగా వైరల్ గా మారాయి.
Puneeth Rajkumar’s affable nature endeared him to people across generations. His genuineness will stay in our hearts forever.#PuneethRajkumar #Appu
Video Credits: @hombalefilms pic.twitter.com/RLWwwCijAr
— P C Mohan (@PCMohanMP) October 29, 2021
తాజాగా పునీత్ మరణంపై వచ్చిన ఓ పెయింటింగ్ అభిమానుల్ని కట్టిపడేసింది. మరణం తర్వాత స్వర్గంలో ఉన్న తండ్రి వద్దకు వెళ్లిన పునీత్.. వెనకనుంచి వచ్చి ఆయన కళ్లు మూస్తాడు. అప్పాజీ చెప్పు నేనెవరో అన్నట్టుగా ఆ ఫొటో ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో బాగా వైరల్ గా మారింది. కన్నడ నటీనటులతోపాటు, ఆయన అభిమానులంతా ఈ ఫొటోనే తమ డీపీగా పెట్టుకోవడం విశేషం.
VAIKUNTHA ? ? #PuneethRajkumar #GoneTooSoon pic.twitter.com/hxEO8NG4ou
— karan acharya (@karanacharya7) November 3, 2021
కరణ్ ఆచార్య అనే పెయింటర్ ఈ చిత్రాన్ని గీశాడు. మొదటగా తన ట్విట్టర్ లో అప్ లోడ్ చేశాడు. ఆ తర్వాత ఆ ఫోటో బొగా ఫేమస్ అయింది. గతంలో యాంగ్రీ హనుమాన్ అనే పెయింటింగ్ తో కరణ్ ఆచార్య బాగా ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం కన్నడ సినిమాలకు ఇతను పనిచేస్తున్నాడు.