కూతుర్ని ఆ తల్లి ఎందుకు చంపిందో తెలుసా..?

    0
    543

    టీవీలో ప్రోగ్రామ్ చూసే విషయంలో జరిగిన గొడవలో మూడేళ్ల కూతురు తండ్రి చెప్పిన ప్రోగ్రామే పెట్టమని కోరిందన్న కారణంతో ఓ తల్లి ఆ కూతుర్ని గొంతు పిసికి చంపేసింది. అత్యంత దారుణం, మాతృత్వానికే మచ్చ తెచ్చిన ఈ ఘోరం బెంగళూరులో నాగర్భవి వీడీఏ లే అవుట్ లో జరిగింది. 26ఏళ్ల సుధ అనే మహిళ తన మూడేళ్ల కూతురు వినుతను గొంతు పిసికి చంపేసింది, లే అవుట్ లో పారేసింది. భర్త ఎర్రన్న మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు కూతురు వినుత, తల్లితో కలసి టీవీ చూస్తోంది. ఇంటికి వచ్చిన భర్త రిమోట్ తీసుకుని టీవీలో వార్తలు చూసేందుకు ఛానెల్ మార్చాడు. ఎప్పుడూ న్యూసే చూస్తుంటావు, న్యూస్ చూసే పనయితే ఇంటికి రావొద్దు అంటూ సుధ, తన భర్త ఎర్రన్నను మందలించింది. దీంతో ఇద్దరి మధ్య తగాదా జరిగింది.

    ఈ తగాదాలో మూడేళ్ల కూతురు జోక్యం చేసుకుని, తండ్రిని న్యూస్ ఛానెల్ చూడనీయమని తల్లిని కోరింది. దీంతో తల్లి సుధ ఆగ్రహంతో ఊగిపోయి, భర్త ఇంట్లోనుంచి బయటకు వెళ్లగానే కూతురి గొంతు పిసికి చంపేసింది. ఆ తర్వాత తన కూతురు కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం ఉదయం ఆ పాప మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు తల్లి, తండ్రుల్ని పిలిపించి విచారణ జరిపారు. తల్లి చెప్పిన విషయాలు అనుమానాస్పదంగా ఉండటంతో గట్టిగా అడగడంతో తానే తన కూతుర్ని చంపేశానంటూ భోరున ఏడ్చింది. టీవీ చూసే విషయంలో తండ్రికి సపోర్ట్ చేసిందనే అక్కసుతోనే ఆవేశంలో చంపేశానని ఒప్పుకుంది.

    ఇవీ చదవండి

    వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

    ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

    టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

    కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ