ఇటీవల మొబైల్ ఫోన్ల ఛార్జర్లు పేలుతున్నాయి.. మొబైల్ ఫోన్లు కూడానా పేలుతున్న ఘటనలు ఉన్నా , ఇప్పుడు సుహిత్ శర్మ అనే వ్యక్తి తన జీన్స్ ప్యాంటు జేబులో మొబైల్ ఫోన్ పేలిందని ట్విట్టర్ లో ఫొటోలతో సహా పెట్టాడు.. దీనివల్ల తీవ్రంగా గాయపడ్డానని కూడా చెప్పాడు. పేలింది చైనా మొబైల్ ఫోన్ అని చెప్పాడు. ఈ విషయం ట్విట్టర్లో పెట్టడంతో , కంపెనీ కూడా స్పందించింది. ఈ విషయం పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పింది.. ఇటీవలకాలంగా ఛార్జర్లు పేలుతున్న ఘటనలపై ప్రపంచ వ్యాప్తంగా చాలా మొబైల్ కంపెనీలపై కేసులు దాఖలై ఉన్నాయి.. దీంతో ఇప్పుడు , మొబైల్ కంపెనీలు కొన్ని , మొబైల్ వరకే అమ్మకాలను పరిమితం చేసుకొని , ఛార్జర్లు తమకు సంబంధంలేదని బయటకొనుగోలు చేసుకోమని చెబుతున్నాయి..