ఆంధ్ర ప్రదేశ్ , తమిళనాడు రాష్ట్రాలకు ,మళ్లీ ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దక్షిణ అండమాన్ సముద్రం మీద కొనసాగుతున్న ద్రోణి కారణంగా రాగల 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
పశ్చిమ-వాయువ్యదిశగా కదులుతూ గురువారం తెల్లవారుజామున వాయుగుండంగా ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోవు 4 రోజులు పాటు దక్షిణకోస్తా-తమిళనాడు తీరాల వెంబడి గంటకు 40 -60 కీ.మీ వేగంతో గాలులు వీస్తాయి.. సముద్రం అలజడిగా ఉంటుంది. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని పేర్కొంది.