ఎగ్జిబిషన్లు అంటే కార్లు, ఫోన్లు, గృహోపకణాలు.. ఏ వస్తువైనా ఎగ్జిబిషన్ లో ఉంటాయని తెలుసు కానీ.. ఓ గద్దల ఎగ్జిబిషన్ ఉంటుందని తెలుసా ? గల్ఫ్ దేశాల్లోని ఖతర్ దేశంలో జరిగే గద్దల ఎగ్జిబిషన్ ప్రపంచ ప్రసిద్ది చెందింది.
ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్ పేరు.. షాహాయిల్ 2022. గత కొన్నేళ్ళుగా జరిగే ఈ అంతర్జాతీయ గద్దల ఎగ్జిబిషన్లో 20 దేశాల నుంచి వచ్చే 108 కంపెనీలకు చెందిన గద్దలు పాల్గొంటాయి. గద్దలు, కంపెనీలు ఏంటని అనుమానం రావచ్చు.
గల్ఫ్ దేశాల్లో పెంపుడు గద్దలు, వేట గద్దలకు బాగా గిరాకీ ఉంది. పలు కంపెనీలు ఈ గద్దలకు శిక్షణ ఇస్తాయి. ఇంట్లో పెంపకానికి పనికొచ్చే గద్దలు కొన్ని అయితే.. వేట గద్దలు మరికొన్ని. ఈ గద్దలను ఉపయోగించి వందల కోట్ల రూపాయల బెట్టింగులు కూడా జరుగుతుంటాయి.
ఈ గద్దల ఎగ్జిబిషన్ సౌదీరాజు ప్రారంభించారు. గల్ఫ్ దేశాల రాయబారులు, ప్రధాని, మంత్రులు కూడా ఈ ఎగ్జిబిషన్ ను చూసేందుకు వస్తుంటారు. విదేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు ఈ ఎగ్జిబిషన్ ను తిలకించేందుకు వస్తారు. ఈ ఏడాది గద్దల ఎగ్జిబిషన్ లో కనీసం ఒక్కో గద్ద ధర ఐదున్నర లక్షల నుంచి మొదలైంది.
ఇవి కూడా చదవండి..