పెళ్ళైన తరువాత క్రికెట్ ఆడేందుకు ఒప్పుకోవాలంటూ , పెళ్ళికొడుకు , అతడి స్నేహితులు పెళ్లికూతురుచేత అగ్రిమెంట్ రాయించారు. ఒక బాండ్ పేపర్ మీద సంతకం కూడా చేయించారు. ఇదంతా , పెళ్లిమండపంలోనే జరిగింది.. వీకెండ్స్ లో , భర్తను ఇంట్లో కట్టిపడేయకుండా , క్రికెట్ ఆడేందుకు పోనీయకుండా చేస్తుందేమోనని ఇలా చేశామని చెప్పారు. ఇదంతా , పెళ్లిమండపంలోనే జరగడం విశేషం
తమిళనాడులోని మధురై జిల్లా ఉసిలింబట్టు నగరంలో ఈ చోద్యం చోటు చేసుకుంది. ఈ టౌన్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసే హరిప్రసాద్ కి , మధురైకి చెందిన పూజతో పెళ్లయింది. హరిప్రసాద్ కి క్రికెట్ అంటే ప్రాణం.. వీకెండ్స్ లో , ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడుతాడు., పెళ్ళైన తరువాత , భర్తను క్రికెట్ ఆడనీయకుండా చేస్తుందేమోనని ఫ్రెండ్స్ , పెళ్లిలోనే ఆమెచేత అగ్రిమెంట్ రాయించి , సంతకం పెట్టించారు.. ఇదో రకం కొత్త ట్రెండ్..
ఇదిలా ఉంటె ఒరిస్సాలో కూడా , పెళ్లిమండపంలోనే , పెళ్లికూతురు , పెళ్ళికొడుకు చేత 8 అంశాలలో భార్య మాటే వింటానని , ఒక అగ్రిమెంట్ పై సంతకం చేయించుకుంది. . అందులో రోజూ పిజ్జాలు తిననని , నెలలో ఒక్క పిజ్జామాత్రమే తింటానని ,చీటికిమాటికి హోటల్ కి పోకుండా ఇంట్లో బోజనమే చేస్తానని , చీర మాత్రమే కట్టుకునేందుకు ఒప్పుకోవాలని , ఫ్రెండ్స్ తో పార్టీకిపోతే వెంట తానూ ఉండాలని , 10 గంటలకల్లా ఇంటికి వచ్చేయాలని , డ్రింక్ తీసుకోకూడదని , ప్రతిరోజూ ఉదయమేలేచి ఇంట్లోనే జిమ్ చెయ్యాలని .. ఇలాంటి షరతులు పెట్టింది..
ఇవి కూడా చదవండి..