అశేష అభిమానులు తమ గుండెల్లో గుడి కట్టి పూజలందుకుంటున్న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సమాధివద్ద రాగిముద్ద , కోడికూర ఎందుకు పెట్టారో తెలుసా..? ఆయన ఎంత టాప్ స్టార్ అయినా , లక్షలాది మంది అభిమానులున్నా , ఆహారం విషయంలో చాలా సాంప్రదాయంగా , సింపుల్ గా ఉంటారు.
ఆయనకు రాగి సంగటి , కోడికూర , ఇడ్లి , అన్నంలో సాంబారు అంటే మహా ఇష్టం.. అందుకే కుటుంబ సభ్యులు ఆయన సమాధివద్ద రాగి సంగటి , కోడికూర , ఇడ్లి , అన్నంలో సాంబారు పెట్టి మంగళవారం మధ్యాహ్నం పూజలు చేశారు.
పునీత్ శ్రీమతి అశ్విని, కూతురులు ధృతి, వందితా, అన్నలు శివరాజ్కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్ కుటుంబ సభ్యులు, మంత్రి గోపాలయ్య ఈ సమాధి పూజలలో పాల్గొన్నారు. పునీత్ రాజ్ కుమార్ సమాధి దర్శనానికి ఈ రోజునుంచి అభిమానులను అనుమతిస్తారు..