ఆంధ్ర ప్రదేశ్ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తన పదవికి రాజీనామా చేశారు. జగన్ ప్రభుత్వంలో మంత్రులు మూకుమ్మడి రాజీనామాల తరువాత , చేసిన తాజా రాజీనామా ఇది.. డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గతంలోనే రాజీనామా చేయాల్సి ఉందని , అయితే కొన్ని కారణాలతో అది వాయిదా పడిందని చెబుతున్నారు.
ఆయన రాజీనామాను , స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. సామాజిక , రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొనే , ఆయన రాజీనామా కోరారని చెబుతున్నారు.. కొత్త ఉప స్పీకర్ ఎన్నిక సోమవారం జరగనుంది. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామికి ఈ పదవి దక్కవచ్చునని భావిస్తున్నారు..
ఇవి కూడా చదవండి..