అరబ్ దేశాల్లో కోటీశ్వరుడిగా పేరుగాంచిన ప్రవాస భారతీయుడు యూసఫ్ అలీ.. కొచ్చిన్ సమీపంలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అలీ తన ఐదుగురు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఇంజిన్ లో లోపంవలన అకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది. దీంతో హెలికాప్టర్ పై నుంచి ఎంతో రిస్క్ చేసి.. దానిని ఒక ఇంటి పెరట్లో దించేశారు. అలీకి వేల కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్నాయి. అలీ కేరళకు చెందిన వ్యక్తి. ప్రమాదం జరిగిన సమయంలో హెలీకాఫ్టర్లో ఆయన భార్య కూడా ఉన్నారు. కుటుంబ, కంపెనీ పనులు చూసుకునేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు.చిన్న గాయాలతో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రమాదమేమి లేదని డాక్టర్లు చెప్పారు..
ఇవీ చదవండి
వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.
ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..
టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?
కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ