మంగళగిరిలో టిడిపి ఆఫీసుపైన జరిగిన దాడికి నిరసనగా బుధవారం రాష్ట్ర బంద్ కు పిలుపు ఇస్తున్నట్టు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇది ప్రజాస్వామ్యంపైనా , ప్రజల మాట్లాడేహక్కుపైన జరిగిన దాడి అని అన్నారు. ఇది రాష్ట్రప్రబుర్వా ప్రేరేపిత ఉగ్రవాదదాడి అన్నారు. తన రాజకీయజీవితంలో ఇలాంటి నీచ రాజకీయాలను ఎప్పుడూ చూడలేదన్నారు. తనను , తమ పార్టీ నాయకులను , బండ బూతులు తిట్టినా సహించామని , ఇప్పుడు ఏకంగా తమ కార్యాలయంపైనే దాడిచేసి , తమ నాయకులను చంపే ప్రయత్నం చేసారని అన్నారు. 24 మందు పాతర్ల దాడికే నేను జంకలేదు .. ఇలాంటివి చాలా చూసాను.. నేను అనుకుంటే నిమిషం చాలు.. అయితే తనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందన్నారు.