ఎద్దు రైలేక్కిసింది.. భలే తమాషా..

    0
    1251

    ఓ ఎద్దు రైలు ఎక్కింది. ఎక్కి రైలు ప్ర‌యాణించిన దూరం వెళ్ళింది. ఈ వింత ఘ‌ట‌న జార్ఖండ్ లో జ‌రిగింది. సాహిబ్‌గంజ్‌కు వెళ్ళే రైలులో ఓ ఎద్దు ఎక్కేసింది. ఎద్దు ఎక్క‌డంతోనే ప్ర‌యాణీకులు బెంబేలెత్తిపోయారు. ఇక రైలు కూడా క‌దిలింది. ఎద్దు కూడా ట్రైన్ జ‌ర్నీ చేసింది. గ‌మ్య స్థానం వ‌ర‌కు అది రైలులోనే ప్ర‌యాణించింది. అది రైలు ఎక్కేట‌ప్పుడు ఎవ‌రూ దాన్ని ప‌ట్టించుకోలేదు.

    అస‌లు ఎద్దు రైల్వే స్టేష‌న్ లోకి ఎలా వ‌చ్చిందో.. ఎవ‌రో ఎక్కించారో.. ఆ స‌మ‌యంలో రైల్వే అధికారులు ఏం చేస్తున్నారో ..? కానీ.. ఎద్దు మాత్రం ఎంచ‌క్కా రైలు ప్ర‌యాణం చేసేసింది. ఇదీ రైల్వేశాఖ ప‌ని తీరు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. గ‌తంలో ప‌శ్చిమ బెంగాల్ లో ఓ గుర్రం కూడా ఇలాగే రైలు ప్ర‌యాణం చేసింది. అప్పుడు కూడా నెటిజ‌న్లు రైల్వేశాఖ తీరుపై సెటైర్లు వేశారు.

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.