ఏసీబీ రైడ్స్ లో ఇంజినీర్ ఇంట్లో డ్రైనేజీ పైప్ లో 25లక్షలు
డ్రైనేజీ పైప్ లో నీళ్లు వస్తాయని తెలుసు. వాష్ రూమ్ డ్రైనేజీ అయితే మురికి నీరు వస్తుందని తెలుసు. అయితే కర్నాటకలో ఒక ఇరిగేషన్ ఇంజినీర్ ఇంటిపై దాడి చేస్తే డ్రైనేజీ పైప్ లోనుంచి 25 లక్షలు వచ్చాయి. ఎస్ఎం బిరాదర్ అనే జూనియర్ ఇంజినీర్ ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. అతని బంధువులు, ఇతర అధికారులకు సంబంధించి కూడా మొత్తం 60 చోట్ల ఒకే సమయంలో ఈ దాడులు చేశారు. ఇందులో 8 మంది ఎస్పీలు, 100మంది ఆఫీసర్లు, 300మంది మిగతా సిబ్బంది ఉన్నారు. బిరాదర్ ఇంటిపై దాడి చేసినప్పుడు 25 లక్షల రూపాయలు ఇంటి డ్రైనేజీ పైపులో దాచిపెట్టేసి ఉన్నాడు. దీన్ని చూసి ఏసీబీ అధికారులకే మతిపోయింది. ఈ రైడ్ లన్నిటిలో జూనియర్ ఇంజినీర్ ఇంట్లో డ్రైనేజీ పైప్ లో డబ్బులు వెలికి తీయడమే ఇప్పుడుసంచలనం అయింది. దానికి సంబంధించిన వీడియో చూడండి.
#Karnataka के कलबुर्गी जिले की ये तस्वीरें हैरान करने वाली हैं, एन्टी करप्शन ब्यूरो की रेड्स में जेवर्गी में एक PWD विभाग के जूनियर इंजीनियर के घर की पाइपलाइन से पानी की जगह पैसा बह रहा है। @indiatvnews #AcbRaid pic.twitter.com/952SpT0G2q
— T Raghavan (@NewsRaghav) November 24, 2021