తన కూతురిపై కన్నేశాడని , తనతో సహజీవనం చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని , ఓ మహిళ పెట్రోల్ పోసి తగలబెట్టేసింది. కిరణ్ అనే మహిళ భర్త 2018లో చనిపోయాడు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు.. భర్త పనిచేస్తున్న కంపెనీలోని ఉద్యోగం ఇచ్చారు. పెళ్ళై , ఇద్దరు పిల్లలున్న పవన్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి , ఇద్దరూ సహజీవనం చేసేస్థాయికి వెళ్ళింది.. ఇటీవల పవన్ కళ్ళు , తన మైనర్ కూతుళ్లపై పడ్డాయని గ్రహించింది. దీంతో పవన్ భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతడు మత్తులోకి జారుకున్నతరువాత , రాత్రి 12 గంటలకు ఆటోని పిలిచి , అతడు తన భర్త అని , ఆరోగ్యం బాగాలేదని చెప్పింది. హాస్పిటల్ బయట దించేసి వెళ్లిన తరువాత , తనతో తెచ్చుకున్న పెట్రోల్ పోసి , రోడ్లోనే తగులబెట్టేసి ఇంటికి వచ్చేసింది.. పోలీసు దర్యాప్తులో , నిజం తెలియడంతో , నేరం ఒప్పుకుంది.. ఈ సంఘటన ఫరీదాబాద్ లో జరిగింది..