14 పిల్లాడిని లేపుకుపోయిన గుడివాడ గుంటది.

    0
    4002

    దారితప్పిన ఆడది ఎంత నీచంగా తయారవుతుందో , గుడివాడలో ఓ వివాహిత ఉదంతమే నిదర్శనం.. నలుగురు బిడ్డలు , భర్త ఉన్న ఆమె , తన ఇంటి ఎదురుగా ఉన్న 14 ఏళ్ళ బాలుడిని లోబరుచుకుని , శారీరిక సంబంధం పెట్టుకొని , బాలుడిని లేపుకుపోయి హైదరాబాద్ లో కాపురం పెట్టింది. భర్తను , నలుగురు బిడ్డలను వదిలేసింది. చివరకు హైదరాబాద్ బాలానగర్ లో ఒక ఇల్లుతీసుకొని , బాలుడితో సహజీవనం చేస్తుండగా , పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆమెపై పోక్సో చట్టం కింద కేసుపెట్టి , జైలుకు పంపారు.

    ఈ మహిళ పిల్లల్తో , మొబైల్లో హోసింగ్ గేమ్ ఆడుతుంది. ఈ క్రమంలో తన కొడుకులకు స్నేహితుడైన , 14 ఏళ్ళ బాలుడిని లోబరుచుకుని , భర్త , పిల్లలకు తెలియకుండా శారీరక సంబంధం పెట్టుకుంది. ఈ బాలుడు 8 వతరగతి చదువుతున్నాడు. స్కూల్ కి కూడా సరిగా పోకుండా , ఈ మహిళతోనే గడిపేవాడు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లితండ్రులు , వాడిని మందలించారు. ఈ విషయం బాలుడు , ఆ మహిళకు చెప్పడంతో , మహిళ , బాలుడిని తనతో వచ్చేయమని కోరింది. బాలుడు కూడా ఒప్పుకోవడంతో ఇద్దరూ చెక్కేశారు.

    హైదరాబాద్ , బాలానగర్ లో ఇల్లు తీసుకొని అక్కడ బాలుడితో సహజీవనం మొదలుపెట్టింది. కొన్నిరోజులకే , బాలుడికి ఇంటిమీద మనసు మళ్లింది. స్నేహితులకు మెస్సేజ్ పెట్టి , డబ్బులు పంపమని కోరాడు,. వాళ్ళు స్పందించకపోవడంతో , నేరుగా తల్లితండ్రులకే మెస్సేజ్ పెట్టాడు. దీనితో ఈ విషయం వాళ్ళు గుడివాడ పోలీసులకు చెప్పడంతో , సిగ్నల్స్ ఆధారంగా , హైదరాబాద్ లో ఇల్లు కనుకొని , ఇద్దరినీ తీసుకొచ్చారు. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి , ఇంటికి పంపేశారు. ఆ నీచురాలిని జైలుకు పంపారు..

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..